ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం

Two Maoists killed in encounter in Mulugu district.పోలీసులు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 5:21 AM GMT
ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం

పోలీసులు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లా వెంటాపురం మండ‌లంలోని క‌ర్రెగుట్ట‌ల అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున క‌ర్రెగుట్ట‌ల‌ అట‌వీ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మవోయిస్టులు మృతి చెందగా.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి. వెంట‌నే అత‌డిని చికిత్స నిమిత్తం హైద‌రాబాద్ త‌ర‌లించేందుకు ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.


Next Story