అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. యువకుడిని హత్య చేయించిన ఇద్దరు బాలికలు.. అరెస్ట్‌

Two girls in Chennai arrested for their suspected participation in the assassination of a 21-year-old boy. తమిళనాడులో ఇద్దరు బాలికలను హత్య కేసులో సోమవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. సన్నిహిత ఫోటోలను

By అంజి  Published on  22 Dec 2021 5:20 AM GMT
అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. యువకుడిని హత్య చేయించిన ఇద్దరు బాలికలు.. అరెస్ట్‌

తమిళనాడులో ఇద్దరు బాలికలను హత్య కేసులో సోమవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. సన్నిహిత ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని 21 ఏళ్ల యువకుడిని కిరాయి హంతకులతో హత్య చేయించారు తోటి విద్యార్థినిలు. చెన్నై శివారులోని ఈచంగాడు గ్రామంలోని రైతులు ఎడారిగా ఉన్న పొలంలో వెంట్రుకలు, రక్తపు మృతదేహాలను గమనించారని అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌లోని అధికారి ఒకరు తెలిపారు. స్థానిక అధికారి ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని చెంగల్పట్టు జిల్లా గూడవాంజేరి పరిధిలో ఉన్న మన్నివాక్కానికి చెందిన ప్రేమ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

అతడు మీనంబాక్కం కాలేజీలో చదువుతున్న తోటి విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. గత సంవత్సరం యువకుడు విద్యార్థినిలను ఆన్‌లైన్‌లో కలుసుకున్నాడు, వారిని ప్రైవేట్‌గా కలుసుకున్నాడు. ఆ తర్వాత వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తానని అమ్మాయిల ఇద్దరి నుండి నగదు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అలాగే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అంతేకాకుండా వారితో మాట్లాడిన సంభాషణలను తల్లిదండ్రులకు పంపి బెదిరించేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థినిలు కిరాయి హంతకులతో యువకుడిని హత్య చేయించారు. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Next Story