రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి.. కన్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న త‌ల్లిదండ్రులు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది

By -  Knakam Karthik
Published on : 12 March 2026 11:46 AM IST

Crime News, Hyderabad, RoadAccident, Rangareddy District, Kothur, BrothersDeath

ఒకే కుటుంబంలో తీరని విషాదం..రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మరణం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం నాడు సూరజ్, బిక్కి అనే యువకులు బైక్‌పై వెళ్తుండగా, గుర్తు తెలియని ఒక వాహనం అతివేగంతో వచ్చి వారిని బలంగా ఢీకొట్టి, వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ భీభత్సమైన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో సూరజ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, బిక్కి చిన్ను ఇంజనీరింగ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. చేతికందివచ్చిన కుమారులు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story