విషాదం: కొడుకు మరణవార్త విని.. బైక్‌పై వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో సోమవారం తన కొడుకు విద్యుదాఘాతంతో మరణించాడనే వార్త విని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తికి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి.

By అంజి
Published on : 24 Jun 2025 7:19 AM IST

Tragic, Father, son death,  road accident, Uttarpradesh

విషాదం: కొడుకు మరణవార్త విని.. బైక్‌పై వస్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి 

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో సోమవారం తన కొడుకు విద్యుదాఘాతంతో మరణించాడనే వార్త విని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తికి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల అయాన్ష్ జైస్వాల్ ఇంట్లో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అతను మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ వార్త విన్న అతని తండ్రి విష్ణు కుమార్ జైస్వాల్ తన మోటార్ సైకిల్ పై తమ గ్రామం రసూలాబాద్ కు బయలుదేరాడు. కానీ ప్రమాదంలో మరణించాడు.

గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతను అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ రెండు సంఘటనలు ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తాయి. గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story