తిరుమల యాత్రలో విషాదం..చిత్తూరు వద్ద కారు-లారీ ఢీకొని కర్ణాటక దంపతుల మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది

By -  Knakam Karthik
Published on : 22 March 2026 4:50 PM IST

Crime News, Andrapradesh,  Chittoor-Tirupati Highway, Tragedy, Accident, Couple Killed, Tirumala Darshan

తిరుమల యాత్రలో విషాదం..చిత్తూరు వద్ద కారు-లారీ ఢీకొని కర్ణాటక దంపతుల మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో కర్ణాటకకు చెందిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటకలోని మాండ్య నివాసులైన సతీష్ మరియు అతని భార్య భాగ్యలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తమ పిల్లలతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ వీరి కుమారుడు సుశాంత్, కుమార్తె పావని మరియు కారు డ్రైవర్ ప్రదీప్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story