సెప్టిక్ ట్యాంక్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు

కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు.

By -  Medi Samrat
Published on : 1 Oct 2025 2:20 PM IST

సెప్టిక్ ట్యాంక్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు

కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కిలోని కట్టప్పనలో ఒక హోటల్ సెప్టిక్ ట్యాంక్‌లో దిగి ముగ్గురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతులను తమిళనాడులోని కుంబంకు చెందిన జయరామన్, గుడలూరుకు చెందిన సుందర పాండియన్, మైఖేల్‌గా గుర్తించారు.

అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించలేకపోయారు. ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి ఎర్త్ మూవర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. గంటన్నర పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, కార్మికులను ఆసుపత్రికి తరలించారు. కానీ వారిని రక్షించలేకపోయారు. మృతదేహాలను కట్టప్పన తాలూక్ ఆసుపత్రిలో ఉంచారు. ఈ సంఘటనపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story