కేరళ రాష్ట్రంలో ముగ్గురు కార్మికులు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కిలోని కట్టప్పనలో ఒక హోటల్ సెప్టిక్ ట్యాంక్లో దిగి ముగ్గురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతులను తమిళనాడులోని కుంబంకు చెందిన జయరామన్, గుడలూరుకు చెందిన సుందర పాండియన్, మైఖేల్గా గుర్తించారు.
అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది మ్యాన్హోల్లోకి ప్రవేశించలేకపోయారు. ఆ ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి ఎర్త్ మూవర్ను ఉపయోగించాల్సి వచ్చింది. గంటన్నర పాటు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, కార్మికులను ఆసుపత్రికి తరలించారు. కానీ వారిని రక్షించలేకపోయారు. మృతదేహాలను కట్టప్పన తాలూక్ ఆసుపత్రిలో ఉంచారు. ఈ సంఘటనపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.