రోడ్డుప్ర‌మాదం.. గద్వాలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Three members of the same family died in a road accident. జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on  20 May 2023 9:45 AM GMT
రోడ్డుప్ర‌మాదం.. గద్వాలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ధ‌రూర్ మండ‌లం వ‌ద్ద వేగంగా వ‌చ్చిన బొలెరో వాహ‌నం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘట‌నాస్థ‌లానికి చేరుకుని, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల‌ను గద్వాల మున్సిపాలిటీ ప‌రిధిలోని దౌద‌ర్‌ప‌ల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో కోరుట్ల మండలం తిమ్మాయపల్లె గ్రామానికి చెందిన సుర భీమయ్య (33) లారీ టైర్ల కిందపడి మృతి చెందాడు. అతని భార్య ప్రేమలత తీవ్ర గాయాలపాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కోరుట్ల మండల తిమ్మాయపల్లె గ్రామానికి చెందిన సుర భీమయ్య, అతని భార్య ప్రేమలత ఇధ్దరు కూలీ పని నిమిత్తం మోటర్ సైకిల్ పై కోరుట్ల పట్టణానికి వచ్చారు. కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న అర్జె 11 జి.బి 0843 నంబర్ గల లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో భీమయ్య అక్కడిక్కడే మృతి చెందగా ప్రేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలానికి కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్ చేరుకొని పరిశీలించారు.


Next Story