ఘోర ప్రమాదం.. మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
Three killed as minibus overturns in Anantapur. ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో
By అంజి Published on
20 Feb 2022 1:56 AM GMT

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని నల్లమూడ మండలం పులగంపల్లి దగ్గర జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 12 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికుల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. అనంతరం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కదిరి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద బాధితులు పులగంపల్లికి చెందినవారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామన్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Next Story