Vikarabad : రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మూడు కుటుంబాల‌తోపాటు స్థానికంగా తీవ్ర‌ విషాదం నెల‌కొంది

By Medi Samrat  Published on  17 Oct 2024 1:52 PM GMT
Vikarabad : రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మూడు కుటుంబాల‌తోపాటు స్థానికంగా తీవ్ర‌ విషాదం నెల‌కొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్ మీద వెళుతున్నారు. మార్గ‌మ‌ధ్యంలో బైక్‌ పూడూరు గేటు వ‌ద్ద‌కు రాగానే ఆర్టీసీ బ‌స్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు ఎగిరి ఒక్క సారిగా రోడ్డు మీద పడిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు యువ‌కులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించ‌గా.. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న మ‌రో యువ‌కుడిని స్థానికులు పరిగి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

స‌మాచారం అందిన వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందిన ముగ్గురు యువ‌కులు పూడూరు మండలంలోని మేడికొండ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడ నుండి వెళ్లిపోయాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహి తులు మరణించ డంతో ఆ గ్రామంలో చీకట్లు అలుముకున్నారు.

Next Story