హైదరాబాద్లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఎన్ఐఏ నివేదిక తెలిపింది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఎన్ఐఏ గతంలోనే హెడ్లీని కూడా విచారించింది. ఈ విచారణలో హెడ్లీ తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు చెప్పాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు భారత్ వచ్చినట్లు చెప్పాడు. లష్కరే తోయిబాలో తాను ఆయుధాలు వాడటానికి సంబంధించి మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు.
భారత్లో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించి ఎల్ఈటీ సభ్యులు చూపించిన మ్యాప్లో హైదరాబాద్లోని సైబరాబాద్ ఉన్నట్లు తెలిపాడు. భారత్కు తనను పంపాలని లష్కరే తోయిబా భావించినప్పుడు హైదరాబాద్, నాగపూర్, కోల్కతా, పుణే, బెంగళూరు నగరాలపై చర్చ జరిగిందని చెప్పాడు. చివరకి ముంబైలో దాడికి పాల్పడ్డారు.