జార్ఖండ్‌లో తెలుగు కాల్ సెంటర్ రాకెట్‌.. ఛేదించిన‌ తెలంగాణ పోలీసులు

Telangana cops bust Telugu call centre scam in Jharkhand. జార్ఖండ్‌లో తెలుగు మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని కాల్‌ సెంటర్‌ రాకెట్‌ను నడుపుతున్

By Medi Samrat  Published on  29 Jan 2022 5:40 AM GMT
జార్ఖండ్‌లో తెలుగు కాల్ సెంటర్ రాకెట్‌.. ఛేదించిన‌ తెలంగాణ పోలీసులు

జార్ఖండ్‌లో తెలుగు మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని కాల్‌ సెంటర్‌ రాకెట్‌ను నడుపుతున్న ఓ బృందాన్ని తెలంగాణ పోలీసులు ఛేదించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శుక్రవారం తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేయడంతో పోలీసులు ఈ మోసాన్ని బట్టబయలు చేశారు. అరెస్టయిన వారిని ఆటోరిక్షా డ్రైవర్లు కాట్రావత్ రాజు, కె సంతోష్, డి శ్రీనివాసులు, విద్యార్థులు ఇ. గణేష్, ఎం. వెంకటేష్, కె. హరిలాల్, కె. గణేష్, ఎం. గణేష్, రైతు కె రాజు గా పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన విక్రమ్ ఠాకూర్‌తో కాట్రావత్ రాజు స్నేహం పెంచుకున్నాడు. అతను హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా మాజీ ఆటోడ్రైవ‌రైన కాట్రావత్ రాజును క‌లిసేవాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజలకు రుణాలు మరియు ఇతర సేవలను అందించే నెపంతో సైబర్‌ఫ్రాడ్ కార్యకలాపాలకు పాల్ప‌డేందుకు వీలుగా తెలుగు జ‌నాల‌ను బుట్ట‌లో వేసేందుకు ప్లాన్‌ను విక్రమ్ ఠాకూర్.. కాట్రావత్ రాజుతో చెప్పాడు.

30 శాతం కమీషన్ ఒప్పందం మీద‌ కాట్రావత్ రాజు తన బావమరిది సంతోష్‌తో కలిసి తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని పెద్దమందడ్ గ్రామం నుండి తెలుగు మాట్లాడే వ్యక్తులను సేకరించడం ప్రారంభించాడు. ఈ నేప‌థ్యంలోనే జనవరి 2021లో మొత్తం తొమ్మిది మంది నిందితులు ధన్‌బాద్‌కు వెళ్లారు. అక్కడ విక్రమ్ ఠాకూర్ వారికి ఫిషింగ్ వంటి ఆన్‌లైన్ మోసపూరిత కార్యకలాపాలలో శిక్షణనిస్తూ వసతి క‌ల్పించాడు. విక్రమ్ ఠాకూర్ నుంచి పలు సిమ్ కార్డులు సేకరించడమే కాకుండా.. కల్పిత పేర్లతో బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన‌ట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.


Next Story