నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాడు.. నన్ను కాదు.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న సూసైట్ నోట్‌

ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.

By Medi Samrat
Published on : 20 March 2025 7:28 PM IST

నా ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాడు.. నన్ను కాదు.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న సూసైట్ నోట్‌

ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న 31 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఘజియాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ మరుసటి రోజు పోలీసులు ఆమె భర్త, ఆమె మామను అరెస్టు చేశారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న కేసు నమోదు చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది. అన్వితా శర్మ ఆత్మహత్య చేసుకోడానికి కొన్ని నిమిషాల ముందు తన సోదరుడు అమిత్‌కు ఒక సందేశం పంపింది. "దయచేసి నన్ను క్షమించి అందరినీ జాగ్రత్తగా చూసుకోండి” అని ఆమె చివరి సందేశం ఉంది.

2019లో అన్విత గౌరవ్ కౌశిక్‌ను వివాహం చేసుకున్న కొన్ని నెలల తర్వాత, ఆమె వివాహంలో సమస్యలను ఎదుర్కొంది. తరచుగా గొడవలు జరిగేవని ఆమె సోదరుడు చెప్పారు. అన్వితను విడాకులు తీసుకునే విషయమై ఆలోచించమని అడిగాము కానీ కౌశిక్ ఆమెను క్షమించమని వేడుకుని తీసుకుని వెళ్ళాడని అన్నారు. సంఘటన స్థలం నుంచి పోలీసులు ఒకటిన్నర పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారని ఏసీపీ అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు. మహిళ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది.. మాకు సూసైడ్ నోట్ కూడా దొరికిందని ఏసీపీ తెలిపారు.

ఆ నోట్‌లో “క్షమించండి, నేను ఇక దేన్నీ భరించలేను. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. నా భర్త ఇంటి పనులన్నీ చేయగల, డబ్బు సంపాదించగల అందమైన అమ్మాయిని కోరుకున్నాడు. నేను చేయగలిగినదంతా చేశాను కానీ ఈ వ్యక్తి ఎప్పుడూ తప్పులు జరుగుతాయా అని ఎదురుచూసేవాడు. ప్రతి వాదనలోనూ, నన్ను, నా కుటుంబాన్ని ఎగతాళి చేసేవాడు. అతను మా అందరికంటే కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. వివాహం తర్వాత నన్ను మరింత చదువుకోనివ్వలేదు. నా అన్ని ఖాతాలకు యాక్సెస్ తీసుకున్నాడు. అతను నన్ను కాదు.. నా ఉద్యోగాన్ని వివాహం చేసుకున్నాడు” అని లేఖలో ప్రస్తావించింది.

Next Story