షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...
By - అంజి |
షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో విద్యార్థులు, సిబ్బంది దాదాపు పది రోజులుగా కుళ్ళిపోయిన మృతదేహాన్ని కలిగి ఉన్న ట్యాంక్ నుండి నీటిని తాగారు. ఈ విషయం తెలిసి విద్యార్థులు అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. డెడ్ బాడీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ నీళ్లు విద్యార్థులు, సిబ్బంది ఇప్పుడు తమ ఆరోగ్య సమస్యలపై ఆందోళనకు గురవుతున్నారు. నీటి నుండి వచ్చిన దుర్వాసన.. ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చింది. దుర్వాసన వస్తుండటంతో శుభ్రపరిచే సిబ్బంది ఐదవ అంతస్తులోని సిమెంట్ ట్యాంక్ను తనిఖీ చేయగా, అక్కడ శవం కనిపించింది.
మృతదేహం బాగా కుళ్ళిపోయి, గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో, పోలీసుల సమక్షంలో అర్థరాత్రి బయటకు తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ సమయంలో ఓపీడీ, వార్డు భవనాలకు నీటిని సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తర్వాత, డియోరియా జిల్లా మేజిస్ట్రేట్ దివ్య మిట్టల్ను ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా నియమించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ బర్న్వాల్ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు.
మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగం అధిపతి డాక్టర్ రజనిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలిక ప్రిన్సిపాల్గా నియమించారు. మంగళవారం ఉదయం తనిఖీ చేస్తున్నప్పుడు, డిఎం దివ్య మిట్టల్ ఐదవ అంతస్తు ట్యాంక్ తాళం వేసి ఉండాల్సి ఉండగా, అది తెరిచి ఉందని గుర్తించారు. జిల్లా మేజిస్ట్రేట్ దీని గురించి ప్రిన్సిపాల్ను ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పటి నుండి ట్యాంక్ మూసివేయబడింది. ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా అందించబడింది. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు, రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.