సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ నడుస్తుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనమ్ రఘువంశీ సోదరుడు గోవింద్ నేరుగా రాజా రఘువంశీ ఇంటికి వెళ్లాడు. రాజా తల్లి ఉమను కలుసుకుని శిరస్సు వంచి ఆమెకు నమస్కరించాడు. తన సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయాలని గోవింద్ అన్నారు. రాజ్ కుష్వాహ మావద్ద పనిచేసేవాడని, అతను మా ఉద్యోగి మాత్రమేనని గోవింద్ తెలిపారు.
అతని ప్రకారం.. సోనమ్ రాజ్కి రాఖీ కట్టేది. మంగళవారం రాత్రి నేను సోనమ్ను 2 నిమిషాలు మాత్రమే కలిశాను, మేము ఎక్కువగా మాట్లాడలేకపోయామని పేర్కొన్నాడు. ఈ కేసులో తన సోదరి దోషి కావచ్చునని, అయితే తన కుటుంబం తప్పులేదని గోవింద్ స్పష్టం చేశారు. అందుకే రాజా ఇంటికి వచ్చినట్లు తెలిపాడు.
“ఆమె (సోనమ్) ఇంకా హత్య చేసినట్లు ఒప్పుకోలేదు, కానీ సాక్ష్యాలను చూస్తే, ఆమె హత్యకు ప్లాన్ చేసిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను రాజా కుటుంబానికి క్షమాపణ చెప్పాను. ఈ కుటుంబం కొడుకును కోల్పోయింది.. సోనమ్ దోషి అయితే ఉరిశిక్ష వేయాలి. నాకు అన్నీ మీడియా ద్వారానే తెలుసు అని సోనమ్ సోదరుడు గోవింద్ పేర్కొన్నాడు. సోనమ్పై కేసు విషయంలో తానే స్వయంగా పోరాడతానని.. రాజ్ కుష్వాహా, సోనమ్ మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని గోవింద్ చెప్పాడు.