మేఘాలయలో హనీమూన్ ట్రిప్లో తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని చంపాలని ఖచ్చితంగా అనుకుంది. సఫారీ తీసుకున్న వ్యక్తులు అందులో విఫలమైతే స్వయంగా పర్వతం నుండి తానే తోసేయాలని ప్లాన్ చేసినట్లుగా ఇండియా టుడే టీవీ వర్గాలు తెలిపాయి. "విశాల్, ఆనంద్, ఆకాష్ రాజాను చంపలేకపోతే, ఫోటో తీస్తూనే భర్తను పర్వతం నుండి తోసేస్తాను" అని సోనమ్ సహ కుట్రదారుడు రాజ్ కుష్వాహాతో చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత మే 15న ఇండోర్లోని తన పుట్టింటికి తిరిగి వచ్చిన వెంటనే సోనమ్ హత్య పథకం పన్నినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి గౌహతికి టిక్కెట్లు బుక్ చేసుకుని, ఫోన్ కాల్స్ ద్వారా రాజ్తో కలిసి కుట్ర పన్నింది. రాజాతో శారీరక సాన్నిహిత్యానికి దూరమవ్వడానికి, ప్లాన్ అమలు చేయడానికి సమయం కోసం, మేఘాలయకు వెళ్లే ముందు కామాఖ్య ఆలయాన్ని సందర్శించమని సోనమ్ భర్తను ఒప్పించింది కూడా.!