మ‌ర‌ణంలోనూ తోడుగా.. త‌మ్ముడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయిన అన్న‌

Siblings die of heart stroke in a gap of three hours in Telangana. లక్సెట్టిపేట పట్టణంలో గుండెపోటుతో మరణించిన సోదరుడి మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్

By Medi Samrat
Published on : 9 May 2022 12:09 PM IST

మ‌ర‌ణంలోనూ తోడుగా.. త‌మ్ముడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయిన అన్న‌

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణంలో గుండెపోటుతో మరణించిన సోదరుడి మృతదేహాన్ని చూసిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన సోమవారం జరిగింది. మృతులు లక్సెట్టిపేట పట్టణానికి చెందిన గాజుల భాస్కర్ గౌడ్ (47), జగిత్యాల జిల్లాకు చెందిన అతని సోదరుడు శ్రీనివాస్ గౌడ్ (55) అని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిరువురు వృత్తిరీత్యా వ్యాపారులు.

భాస్కర్ గౌడ్ ఉదయం 5 గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తుండగా.. గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య శ్రీనివాస్ ఉదయం 8 గంటలకు లక్సెట్టిపేటకు చేరుకున్నాడు. మృతదేహాన్ని చూసి షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని ధర్మపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

మూడు గంటల వ్యవధిలో తోబుట్టువులను పోగొట్టుకోవడంతో శ్రీనివాస్, భాస్కర్‌ల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వారు ఓదార్చలేనంతగా విలపించారు. ఈ మరణం అన్నదమ్ముల బంధాన్ని విడదీయలేకపోయిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.













Next Story