పండుగ‌పూట ఘోర రోడ్డు ప్ర‌మాదం.. వ‌రంగ‌ల్‌లో రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ

Road accident in Warangal.పండుగ పూట వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది,రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 5:37 AM GMT
Road accident in Warangal

పండుగ పూట వరంగల్ అర్బన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఎల్కతుర్తి మండలం వల్భాపుర్ గ్రామంలో జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 24 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

ఓ బస్సు వరంగ‌ల్‌‌ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా.. మరో బస్సు నిజామాబాద్‌ నుంచి వరంగల్‌ వైపు వ‌స్తుంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాల్సి ఉంది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా..? లేక డ్రైవర్ వైఫల్యమా..? అనేది తేల్చేపనిలో అధికారులు పడిపోయారు.


Next Story