నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి  Published on  6 March 2024 2:54 AM GMT
road accident, nandyal district,  Hyderabad, Crime news

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

ఇటీవల కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కారులో ప్రయాణించిన అందరూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరూ మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు. బాలకిరణ్ తల్లి దండ్రులు లక్ష్మీ, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి వేడుకలు జరగగా ఈ నెల 3న శామీర్ పేటలో రిసెప్షన్ అయినట్లు తెలిసింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story