కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Road Accident In Kamareddy District. తెలుగు రాష్ట్రాలలో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  28 March 2022 6:01 AM GMT
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

తెలుగు రాష్ట్రాలలో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు- కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాచారెడ్డి మండలంలో సోమవారం ఉదయాన ఈ ప్రమాదం జరిగింది. ఘన్‎పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. బస్సు కరీంనగర్ వన్ డిపో‎కు చెందినదిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ – TS 16 FB 4366 అని తెలిపారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, గాయ‌ప‌డ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆర్టీసీ బ‌స్సు టైర్ పేల‌డంతోనే అదుపుత‌ప్పి కారును ఢీకొట్టిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. క‌రీంన‌గ‌ర్ డిపో-1 బ‌స్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


















Next Story