మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు.. రిక్షా డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

2021 సంవత్సరంలో ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 74 ఏళ్ల రిక్షా డ్రైవర్‌కు ఢిల్లీ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

By Medi Samrat
Published on : 28 May 2025 8:49 PM IST

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు.. రిక్షా డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

2021 సంవత్సరంలో ఆరు, ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 74 ఏళ్ల రిక్షా డ్రైవర్‌కు ఢిల్లీ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సెక్షన్ 6, IPCలోని సెక్షన్ 376AB కింద గతంలో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం దోషి 2021లో అనేక సందర్భాలలో ఇద్దరు మైనర్ బాలికలపై డిజిటల్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఏప్రిల్ 17న జారీ చేయబడిన ఒక ఉత్తర్వులో "దోషి చర్యలు బాధితుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. వారి సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది" అని కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులోని మొత్తం వాస్తవాలు, పరిస్థితులు, చేసిన నేరం స్వభావం, మైనర్ బాధిత బాలికల వయస్సును పరిగణనలోకి తీసుకుని, కోర్టు దోషికి పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

Next Story