సమాధి తవ్వి.. తల్లి మృతదేహాన్ని బయటకు తీసి.. ఇంటికి తీసుకువచ్చిన కొడుకు.. కానీ

Police detain man for digging mother's grave, keeping corpse at home. తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో పాక్షికంగా కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని ఆమె కుమారుడు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత

By అంజి  Published on  26 Dec 2021 10:49 AM GMT
సమాధి తవ్వి.. తల్లి మృతదేహాన్ని బయటకు తీసి.. ఇంటికి తీసుకువచ్చిన కొడుకు.. కానీ

తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో పాక్షికంగా కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని ఆమె కుమారుడు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత.. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడు 38 ఏళ్ల వ్యక్తి. తన తల్లి సమాధిని రహస్యంగా తవ్వి, ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అతను కున్నం సమీపంలోని పరవై గ్రామ నివాసి. మానసికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలమురుగన్ గతంలో తన తల్లి మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించగా స్థానికులు జోక్యం చేసుకుని ఖననం చేసిన ప్రదేశంలో అడ్డుకున్నారు. కున్నం పోలీసులు అతడిని అరెస్టు చేసి మృతదేహాన్ని పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

అతడికి రాత్రి భోజనం పెట్టేందుకు బంధువుల్లో ఒకరు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి స్థానికులు, కున్నం పోలీసులకు సమాచారం అందించారు. అనుమానితుడు తెలివిగా సమాధిని తవ్వి మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి తీసుకువచ్చాడు. అనుమానితుడు తరచుగా శ్మశానవాటికను సందర్శించేవాడు. అంతకుముందు శ్మశానవాటికలో పట్టుకున్నందున అతని తల్లి సమాధిని తవ్వకుండా స్థానికులు అడ్డుకున్నారని ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు. అనుమానితుడు మానసికంగా కలవరానికి గురైనట్లు తెలుస్తోంది.

Next Story