బేకరీలో వ్యక్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
By Medi Samrat
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ సంఘటనకు చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదం, కుటుంబ శత్రుత్వం కారణమని సమాచారం.
అరెస్టయిన వారిని రవి, ప్రదీప్, మంజునాథ్, నాగరాజ్, మంజునాథ్, గౌతమ్, ప్రమోద్లుగా గుర్తించారు. బాధితుడు తవరగేరా పట్టణంలో నివసించే రోజువారీ కూలీ అయిన చన్నప్ప హుసేనప్ప నరినాల్ అని తెలుస్తోంది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రజల కళ్లముందే హత్యకు గురయ్యాడు.
బేకరీ లోపల ఉన్న సిసిటివి వీడియోలో చన్నప్పను కత్తులతో దాడి చేసిన క్షణం రికార్డైంది. దుండగులు అతని మెడ, తల, వీపు భాగాలపై దాడి చేసి అక్కడికక్కడే చంపారు. బేకరీ లోపల చన్నప్పపై దాడి చేయడం ప్రారంభించి, అతన్ని బయటకు ఈడ్చుకెళ్లి, చనిపోయే వరకు దాడిని ఎలా కొనసాగించారో వీడియో చూపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసిన వారు దాడి చేసి రెండు నిమిషాల్లోనే పారిపోయారు.
స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్న సింధనూర్ సర్కిల్కు సమీపంలోని ఎల్జె అయ్యంగార్ బేకరీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. దీనిని మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి, చనప్ప రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూస్తూ ఉన్నారు. అతని పక్కన ఒక వృద్ధ మహిళ ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది.