అపూర్వ శెట్టి అనుమానాస్పద మృతి.. విషాహారం తినిపించి చంపారా..?

Mysuru BCA Student Found Dead in Private Hotel. కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని ఓ హోటల్‌లో 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా

By Medi Samrat  Published on  2 Sep 2022 2:15 PM GMT
అపూర్వ శెట్టి అనుమానాస్పద మృతి.. విషాహారం తినిపించి చంపారా..?

కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని ఓ హోటల్‌లో 21 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిని అని తెలిసింది. నగరంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న ఆమెను పెరియపట్నానికి చెందిన అపూర్వ శెట్టిగా గుర్తించారు. ఆగస్టు 29న నగరంలోని వినోభా రోడ్డులోని కోరమ్ హోటల్‌లోని గదిలోకి వెళ్లిన సమయంలో ఆమె ఒక యువకుడితో కలిసి ఉంది.

డిసిపి (లా అండ్ ఆర్డర్) ప్రదీప్ గుంటి మాట్లాడుతూ "మేము హోటల్ నుండి సమాచారం అందుకున్నాము. మా ఫోరెన్సిక్ బృందం మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని, ఆ తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుంది." అని అన్నారు. ఆమె తలను గోడకు కొట్టడంతో పాటు విషం కలిపిన ఆహారాన్ని ఆమెకు తినిపించినట్లు అనుమానిస్తున్నారు.

చనిపోయిన అమ్మాయి BCA విద్యార్థిని, 15 రోజుల తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరి ఉండేది. కానీ విధి మరోలా రాసిపెట్టింది. స్నేహితుడితో కలిసి లాడ్జికి వెళ్లిన విద్యార్థిని ఊహించని కష్టాల్లో పడింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిరియాపట్నం తాలూకా హరలహళ్లి గ్రామానికి చెందిన రవి కుమార్తె అపూర్వ శెట్టి(21) లాడ్జిలో మృతి చెందింది. ఆమె మైసూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజుల్లో ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత సొంత ఊరికి వెళ్లాలని అనుకోగా.. ఇంతలో మరణం ఆమెకు చేరువైంది.

అపూర్వ శెట్టి గత కొన్నేళ్లుగా ఆషిక్ అనే యువకుడితో డేటింగ్ చేస్తోంది. రెండు రోజుల క్రితం ఆశిక్ ఆమెతో పాటు వచ్చి మైసూరు జిల్లా హున్సూర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆశిక్ తరచూ బయటకు వెళ్లి తిరిగి హోటల్‌కు వచ్చేవాడు. నిన్న ఉదయం హోటల్ నుంచి వెళ్లిన ఆషిక్ తిరిగి హోటల్ కు రాలేదు. ఆమె కూడా హోటల్ నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గదిలో ఉన్న ఇంటర్ కాల్ కు ఫోన్ చేశారు. ఎటువంటి స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఆందోళన చెంది వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి గదిని తెరిచి చూడగా, అపూర్వ శెట్టి గదిలో విగతజీవిగా పడి ఉంది.

అపూర్వ శెట్టి స్నేహితుల సమాచారం ప్రకారం, ఆషిక్- అపూర్వ శెట్టి చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం విషయం తెలిసి కుటుంబీకులు గొడవపడ్డారు. ఇద్దరూ దూరంగా ఉండాలని సూచించారు. అయితే ఆ తర్వాత కూడా ఆ అబ్బాయితో ఆమె స్నేహం కొనసాగించింది. ఆమె తరచూ అతడితో తిరుగుతుంటుందని తెలిసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అపూర్వ శెట్టి తండ్రి దేవరాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హోటల్‌లో కలిసి ఉన్న సమయంలో గొడవ జరిగి తన కుమార్తెను హత్య చేసి ఉండొచ్చని ఆరోపించారు. పోలీసులు ఆషిక్ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆషిక్ కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.




Next Story