పండక్కి ఇంటికి రాని కొడుకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

Mother suicide in SR nagar police station area. ఓ తల్లి దీపావళి పండక్కి కొడుకు, కోడలు ఇంటికి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌

By అంజి  Published on  13 Nov 2021 2:47 AM GMT
పండక్కి ఇంటికి రాని కొడుకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

పండక్కి అందరి ఇళ్లు కళకళలాడుతుంటాయి. ఇక తల్లికి అయితే వేరే దగ్గర స్థిరపడ్డ కొడుకు, కోడలు వస్తారన్న ఆశ ఎంతగానో ఉంటుంది. అయితే ఓ తల్లి దీపావళి పండక్కి కొడుకు, కోడలు ఇంటికి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్‌కాలనీలో దండ బుచ్చి బాబు, సుజాత (53)లు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు దండ యోగకు ఈ ఏడాది ఆగస్టులో గుంటూరుకు చెందిన రాహిత్యశ్రీతో పెళ్లి జరిగింది.

ఆ తర్వాత ఇద్దరు ఉద్యోగం రిత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. దీపావళి పండక్కి ఇంటికి రావాలని కొడుకు, కోడలును తల్లి సుజాత కోరింది. సెలవు లేకపోవడంతో వారు రాలేదు. గంపెడాశతో ఎదురు చూసిన తల్లి సుజాత కొడుకు, కోడలు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు భర్త బుచ్చిబాబు పెంట్‌హౌస్‌లో నిద్రపోతుండగా.. భార్య సుజాత కింద అంతస్థులోని గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలో వచ్చిన భర్త.. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వెంటనే పోలీసులకు అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story