కరోనాకు భయపడి.. విషం తాగి తల్లీ కొడుకులు మృతి

Mother and son die after consuming poison fearing Covid in Tamil Nadu. తమిళనాడులోని మధురైలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో 23 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు విషం సేవించి మరణించారు.

By అంజి  Published on  10 Jan 2022 4:12 AM GMT
కరోనాకు భయపడి.. విషం తాగి తల్లీ కొడుకులు మృతి

తమిళనాడులోని మధురైలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకుతుందనే భయంతో 23 ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కుమారుడు విషం సేవించి మరణించారు. మరణించిన మహిళ తల్లి, సోదరులతో సహా కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు కరోనా సోకుతుందని భయపడి విషం సేవించారు. వీరిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడగా, ఆ మహిళ, ఆమె మూడేళ్ల చిన్నారి మృతి చెందారు. పోలీసులు వారిని గుర్తించారు. అందిన వివరాల ప్రకారం.. తల్లి లక్ష్మి తన భర్త నాగరాజ్‌ను కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయింది. భర్త, దినసరి కూలీ డిసెంబర్‌లో సహజ మరణం పొందాడు. నాగరాజ్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతురాలు జోతిక తన భర్తతో విడిపోయి తల్లి వద్ద ఉంటోంది. జనవరి 8న జోతికకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే విషయాన్ని తన తల్లికి తెలియజేసింది.

ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతుందనే భయంతో కుటుంబ సభ్యులు విషం తాగినట్లు సమాచారం. మరుసటి రోజు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు కుటుంబంలోని ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చే సరికి జోతిక, ఆమె కొడుకు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కోవిడ్-19, దాని పర్యవసానాల గురించి కుటుంబం భయపడి జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, వైద్య సహాయం తీసుకోవాలని ఆరోగ్య అధికారులు కోరారు.

Next Story