వైన్ షాపులో గొడ‌వ‌.. వేడి నూనె మీద పోయ‌డంతో..

Men Attack At Wine Shop. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ వైన్స్ ప‌ర్మిట్‌

By Medi Samrat  Published on  31 Aug 2021 12:14 PM GMT
వైన్ షాపులో గొడ‌వ‌.. వేడి నూనె మీద పోయ‌డంతో..

హైద్రాబాద్‌ : నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ వైన్స్ ప‌ర్మిట్‌ రూమ్ లో తలెత్తిన చిన్నపాటి వివాదం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే.. శివ కుమార్ అనే వ్యక్తిపై మ‌రో వ్య‌క్తి ధర్మేందర్ వేడి నూనె పోయ‌డంతో తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం 9 గంటల స‌మ‌యంలో ఈ గొడ‌వ జరిగింది. తీవ్ర గాయాల‌పాలైన శివ కుమార్ ప్ర‌స్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి దిగిన వ్యక్తి ధర్మేందర్ ని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి ఓ బీజేపీ నాయ‌కుడి దగ్గర డ్రైవర్ గా ఉన్నట్లు సమాచారం.





Next Story