హైదరాబాద్ నగరంలో మసాజ్ సెంటర్ ముసుగులో నిబంధల ఉల్లంఘనలు సాగుతూ ఉన్నాయి. డిఫెన్స్ కాలనీలోని ఒక మసాజ్ సెంటర్పై దాడులు నిర్వహించిన నేరేడ్మెట్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. శిక్షణ లేని థెరపిస్టులు క్రాస్-జెండర్ మసాజ్ను అనుమతించినందుకు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు యజమానులు, మేనేజర్పై కేసు నమోదు చేశారు. నేరేడ్మెట్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 223 కింద కేసులు నమోదు చేశారు.
"మసాజ్ సెంటర్ కు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నప్పటికీ, మహిళా థెరపిస్టులు మగ క్లయింట్లకు మసాజ్లు అందిస్తున్నారు, ఇది చట్టవిరుద్ధం. అధికారిక ఆదేశాలను ధిక్కరించినందుకు మేము నోటీసును అందజేశాము, ”అని పోలీసులు తెలిపారు.