భార్య వివాహేతర సంబంధం.. నలుగురు పిల్లలతో కలిసి రైలు ముందు దూకిన వ్యక్తి
ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి
భార్య వివాహేతర సంబంధం.. నలుగురు పిల్లలతో కలిసి రైలు ముందు దూకిన వ్యక్తి
మంగళవారం ఢిల్లీలోని ఫరీదాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలం నుండి ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని బీహార్ నివాసి మనోజ్ మహతోగా గుర్తించారు. అతని భార్య ఫోన్ నంబర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం బాద్షా ఖాన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
"గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ పైలట్ ఈ సంఘటన గురించి స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించాడు, ఆయన మాకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, మేము అతని పేరు మరియు అతని భార్యకు చెందిన ఫోన్ నంబర్ ఉన్న ఆధార్ కార్డును కనుగొన్నాము. ఆమెకు ఈ సంఘటన గురించి సమాచారం అందించబడింది. ఆమె మృతదేహాలను గుర్తించింది" అని జీఆర్పీ ఎస్హెచ్వో రాజ్ పాల్ అన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నేహా తన భర్త పిల్లలను పార్కుకు తీసుకెళ్లే నెపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని వారికి చెప్పింది. "మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు" అని ఆయన అన్నారు.
మృతుడి భార్య ప్రీతి మాట్లాడుతూ.. తన భర్త తన బంధువులలో ఒకరితో తాను ఫోన్లో మాట్లాడుతుండటం వల్ల తనకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడని, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది.