దారుణం.. అడవిలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. గొంతు నులిమి హత్య

Man rapes daughter before strangling her to death in Madhyapradesh. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సంస్‌గఢ్ అడవుల్లో ఓ మహిళ, ఆమె కుమారుడి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.

By అంజి  Published on  16 Nov 2021 1:08 PM GMT
దారుణం.. అడవిలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. గొంతు నులిమి హత్య

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సంస్‌గఢ్ అడవుల్లో ఓ మహిళ, ఆమె కుమారుడి మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందని.. హత్య చేసిన వ్యక్తి మరెవరో కాదు.. చనిపోయిన మహిళ కన్నతండ్రి అని తెలిపారు. 2 రోజుల క్రితం సంస్‌గఢ్ అడవుల్లో ఛిద్రమైన మహిళ, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశామని రాతిబాద్ పోలీసులు సుదేష్ తివారీ మీడియాకు తెలిపారు.

పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు.. మృతదేహం సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌లో నివసిస్తున్న మహిళ, ఆమె కుమారుడిదని తేలిందని ఆయన చెప్పారు. దీని ఆధారంగా పోలీసులు విచారించగా ఎన్నో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలికి ఏడాది క్రితం ప్రేమ వివాహంజరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీని ఆధారంగా కుటుంబ సభ్యులను విచారించగా తండ్రిపై అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో ఆమె తండ్రి నేరాన్ని అంగీకరించాడు.. అతను చెప్పినది విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. కన్నతండ్రి తన కూతురిపై ఇలాంటి దారుణానికి ఒడిగడతాడా అని అందరూ నిర్ఘాంతపోయారు.

సుదేష్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి కుమార్తెకు ప్రేమ వివాహం జరిగిందని, ఆ తర్వాత ఆమె రాయ్‌పూర్‌కు వెళ్ళిపోయింది. కూతురు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని.. అందుకే తాను కోపాన్ని పెంచుకున్నానని పోలీసులతో నిందితుడు తెలిపాడు. పెళ్లయినప్పటి నుంచి అతడి కూతురు ఇంటికి రాలేదు.

దీపావళి రోజున రాయ్‌పూర్‌లో భర్తతో కలిసి నివసిస్తున్న మహిళ రతీబాద్‌లోని తన అక్క ఇంటికి చేరుకుంది. ఆమె ఎనిమిది నెలల కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో, ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది. సమాచారం అందుకున్న తండ్రి తన కుమారుడితో కలిసి రతీబాద్‌ చేరుకుని చనిపోయిన శిశువుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు తమతో పాటు అటవీ ప్రాంతానికి రావాల్సిందిగా మహిళను కోరాడు.

మహిళ సోదరుడు రోడ్డుపై నిలబడి ఉండగా.. ఆమె తన తండ్రితో కలిసి అడవికి వెళ్లింది. తండ్రి మహిళపై దాడి చేసి, ఆమెపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం కొడుకుతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. చిన్న కూతురిని తానే హత్య చేసినట్లు ఆమె పెద్ద కుమార్తెకు కూడా తెలియజేశాడు. నేరం అంగీకరించిన తర్వాత నిందితుడైన తండ్రిపై ఐపీసీ సెక్షన్ 302, 376 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Next Story