మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న‌ భార్య.. కోపంతో భ‌ర్త ఏం చేశాడంటే..

సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను ఆమె భర్త హత్య చేశాడు.

By Medi Samrat
Published on : 10 Jun 2025 8:33 PM IST

మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్న‌ భార్య.. కోపంతో భ‌ర్త ఏం చేశాడంటే..

సరూర్‌నగర్‌లోని భాగ్యనగర్ కాలనీలో ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను ఆమె భర్త హత్య చేశాడు. బాధితురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరిలోని కొమనపల్లికి చెందిన అమృతగా గుర్తించారు. మారియా దాస్ భార్యను హత్య చేసాడు. ఈ జంట గత మూడు సంవత్సరాలుగా సరూర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఒకరి మీద మరొకరికి అనుమానం ఉండడంతో దంపతులు తరచూ గొడవలు పడుతుండేవారు. అమృత మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నందున తగాదాలు మరింత పెరిగాయి.

శనివారం పని మీద వెళ్లిన మరియా దాస్ మంగళవారం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అమృత తెలియని వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటం గమనించాడు. దీనితో కోపంగా ఉన్న మరియా దాస్ అమృతతో వాగ్వాదానికి దిగాడు. స్కార్ఫ్ తీసుకొని ఆమె గొంతు బిగించి చంపాడు. మృతదేహాన్ని మంచంపై వదిలి హత్య గురించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సరూర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మరియా దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story