రెంట్ కట్టడం లేదని చంపేశాడు

Man Kills Tenant After He Fails To Pay Rent in Gurugram's Sector 5. గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. గురుగ్రామ్ సెక్టార్ 5 లో ఇంటి అద్దె చెల్లించనందుకు

By Medi Samrat  Published on  7 May 2023 1:00 PM GMT
రెంట్ కట్టడం లేదని చంపేశాడు

గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. గురుగ్రామ్ సెక్టార్ 5 లో ఇంటి అద్దె చెల్లించనందుకు తన యజమాని ఓ వ్యక్తిని హత్య చేశాడు. బాధితుడిని రాజేందర్‌గా గుర్తించారు. అతను మద్యానికి బానిస అయ్యాడు. ఓనర్ అద్దె చెల్లించామని అడుగుతూ ఉన్నా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని సురేశ్ మే 1న అద్దె వసూలు కోసం రాజేందర్‌ నివాసానికి వెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం సేవించారు, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన సురేష్.. రాజేందర్ ను అద్దె గురించి ప్రశ్నించాడు. ఆ తర్వాత గొడవ పెద్దదై గొంతు నులిమి హత్య చేశాడు.

నిందితుడు మృతదేహాన్ని గ్రామంలోని వాటర్ ట్యాంక్ దగ్గర పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మే 2న, శరీరంపై గాయాలతో ఒక వ్యక్తి శవం కనిపించిందని పారిశుధ్య కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. సెక్టార్ 5 పోలీస్ స్టేషన్‌లో హత్యపై కేసు నమోదైంది.


Next Story