Hyderabad: దారుణం.. మద్యం మత్తులో బంధువును బండరాయితో కొట్టి చంపాడు

హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన గొడవలో ఒక వ్యక్తి తన బంధువును హత్య చేశాడు.

By అంజి
Published on : 5 Aug 2025 10:59 AM IST

Man kills cousin, drunken brawl, Hyderabad, Crime

Hyderabad: మద్యం మత్తులో బంధువును చంపిన వ్యక్తి

హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మద్యం తాగిన గొడవలో ఒక వ్యక్తి తన బంధువును హత్య చేశాడు. బోరబండలోని ఇందిరా నగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తి.. తన బంధువు బస్వరాజ్ (30)ను కొట్టి చంపాడు. సోమవారం రాత్రి పర్వత్‌నగర్‌లో మద్యం తాగి ఉన్న సమయంలో ఇద్దరూ గొడవ ప్రారంభించారు.

నివేదికల ప్రకారం.. బసవరాజ్, ప్రేమ్‌రాజ్ గొడవ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున ప్రేమ్‌రాజ్ ఒక రాయిని తీసుకొని బాధితుడి తలపై కొట్టాడు. బసవరాజ్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని సనత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు , అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్‌రాజ్‌ను అరెస్టు చేశారు.

Next Story