మొక్క పీకేసాడని.. మైనర్‌ని చంపిన 12 ఏళ్ల బాలుడు

Madhya Pradesh Boy Kills Another Minor Over Uprooting Plant. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తమ వ్యవసాయ పొలం నుండి చిక్‌పా మొక్కను పీకేయడం

By అంజి  Published on  30 Jan 2022 5:47 AM GMT
మొక్క పీకేసాడని.. మైనర్‌ని చంపిన 12 ఏళ్ల బాలుడు

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తమ వ్యవసాయ పొలం నుండి చిక్‌పా మొక్కను పీకేయడం గుర్తించిన 12 ఏళ్ల బాలుడు ఏడేళ్ల వయస్సు గల మరో మైనర్‌ను చంపేశాడని పోలీసులు శనివారం తెలిపారు. జనవరి 26న ఖక్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే మైనర్‌ బాలుడి మరణం మరుసటి రోజు తెలిసిందని వారు తెలిపారు. "బుధవారం సాయంత్రం బీన్స్ తినడానికి ఏడేళ్ల బాలుడు చిక్‌పాన్ మొక్కను పీకేయడాన్ని గమనించిన నిందితుడికి కోపం వచ్చింది" అని ఖక్నార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కీర్తన్ ప్రసాద్ ధుర్వే తెలిపారు.

12 ఏళ్ల బాలుడు బాధితుడిని కొట్టడం ప్రారంభించాడు. తరువాత అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని భావించి పొలంలో వదిలివేసినట్లు అధికారి తెలిపారు. "బాలుడు బాధితుడిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు, కాని అది విఫలమవడంతో ఇంటికి వెళ్ళాడు." అని అతను చెప్పాడు. నిందితుడు గురువారం పొలానికి వెళ్లి చూడగా బాధితుడు అక్కడే పడి ఉండటాన్ని గమనించాడు. ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపడం వల్లే బాలుడు మృతి చెందినట్లు తేలిందని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Next Story