స్టేషన్‌ఘన్‌పూర్‌లో టూరిస్ట్‌ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

Lorry collide with bus in station ghanpur. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చాగల్లు గ్రామం దగ్గర ఆగిఉన్న టూరిస్టు బస్సును లారీ ఢీ కొట్టింది.

By అంజి  Published on  21 Nov 2021 4:26 AM GMT
స్టేషన్‌ఘన్‌పూర్‌లో టూరిస్ట్‌ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చాగల్లు గ్రామం దగ్గర ఆగిఉన్న టూరిస్టు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద బాధితులు హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. గోవా టూర్‌కు వెళ్లి వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావిరాల దగ్గర ఆగి ఉన్న లారీని ట్రక్కు ఢీ కొట్టింది. నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story