హైదరాబాద్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రాకేష్ అనే 24 ఏళ్ల యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది

By Medi Samrat  Published on  6 Sep 2024 3:35 PM GMT
హైదరాబాద్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రాకేష్ అనే 24 ఏళ్ల యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. శుక్రవారం XII అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి T. అనిత ఈ తీర్పును వెలువరించారు. ధర్మాసనం దోషికి రూ. 10,000 జరిమానా విధించింది.

2019లో ఏడో తరగతి చదువుతున్న బాధితురాలు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. బాధితురాలి సోదరుడి స్నేహితుడు రాకేష్ ఆమెను తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో ఆమె తన ఇంటికి చేరుకుంది. పరిస్థితి విషమంగా ఉండటంతో పెట్లబుర్జ్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు తమ ప్రయత్నం చేసినా ఆమె ఉదర సంబంధ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ మరణించింది. డాక్టర్ సాక్ష్యం, DNA నివేదిక కారణంగా నిందితుడికి శిక్ష పడింది. హైదరాబాద్‌ సిటీ పోలీసులు, భరోసా సెంటర్‌ బృందం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నిర్విరామంగా కృషి చేయడంతో శిక్షను ఖరారు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా సహకారాన్ని అందించిన వారిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాస రెడ్డి అభినందించారు.

Next Story