బెంగళూరులో ఒక మహిళ విషయంలో రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. కోరమంగళ ప్రాంతంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో గొడవ జరిగింది. రెండు గ్రూపుల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నట్లు కనిపిస్తోంది. గ్రూపు సభ్యుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.
రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు మద్యం తాగి ఉన్నారు. ఒక మహిళ విషయంలో ఆ గ్రూపులు ఘర్షణ పడ్డాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించి మరింత సమాచారం సేకరించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.