హనీమూన్ హత్య : శవం దగ్గరకు వచ్చి.. ఎంతగా నటించాడంటే..?

మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపాడనే ఆరోపణలతో అరెస్టయిన ఇండోర్ మహిళ ప్రియుడు బాధితుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె తండ్రిని ఓదార్చుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

By Medi Samrat
Published on : 10 Jun 2025 3:33 PM IST

హనీమూన్ హత్య : శవం దగ్గరకు వచ్చి.. ఎంతగా నటించాడంటే..?

మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపాడనే ఆరోపణలతో అరెస్టయిన ఇండోర్ మహిళ ప్రియుడు బాధితుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఆమె తండ్రిని ఓదార్చుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. 29 ఏళ్ల రాజా రఘువంశీని అతని భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కుట్రలో భాగంగా చంపారని పోలీసులు తెలిపారు. సోనమ్, రాజ్, ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను అరెస్టు చేశారు.

రాజా రఘువంశీ అంత్యక్రియలకు సోనమ్ తండ్రి దేవి సింగ్ తో రాజ్ కనిపించాడు. బాధితుడి తల్లి ఉమా రఘువంశీ కూడా, తన కొడుకు పెళ్లిలో కొంతమంది రాజ్ ను సోనమ్ తండ్రితో చూశారని పేర్కొన్నారని తెలిపారు. మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన‌ ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తన భర్తను హత్య చేసేందుకు అతని భార్య సోనమ్ రఘువంశీ కాంట్రాక్ట్ ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి.

Next Story