పది రోజుల వ్యవధిలో ఒడిశాలో ఐదు వేర్వేరు అత్యాచార కేసులు నమోదయ్యాయి. మయూర్భంజ్ జిల్లాలోని కరంజై ప్రాంతంలో స్థానిక ఆలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ముగ్గురు వ్యక్తులు ఆమెను ఆపి, సమీపంలోని అడవి లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశారని తెలుస్తోంది. మలర్పాడ గ్రామానికి చెందిన బికాష్ పాత్ర అనే అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు.
ఇక గోపాల్పూర్ బీచ్ సమీపంలో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి పది మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు స్నేహితుడితో కలిసి బీచ్కు వెళ్లినట్లు సమాచారం. నిందితులు ఆ యువకుడిని దూరంగా లాక్కెళ్లి, కట్టివేసి, ఆపై మహిళపై అత్యాచారం చేశారు. పది మంది అనుమానితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇలా 10 రోజుల్లో 5 అత్యాచారాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.