నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను అమ్ముతున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల వ్యక్తిని జూన్ 6 శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని సైఫాబాద్ నివాసి, మంగళ్హాట్కు చెందిన ఆకాష్ షిండేగా గుర్తించారు. అతను అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో కేర్టేకర్గా పనిచేస్తున్నాడు.
నిందితుడు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుండి ఇ-సిగరెట్లను అక్రమంగా రవాణా చేయడం ప్రారంభించాడు. అతను ఎల్ఫ్బార్, ఎలక్స్, రాయ డి1, నాస్టీ, షిషా వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను సేకరించి హైదరాబాద్లోని కళాశాల విద్యార్థులు, టీనేజర్లకు విక్రయించాడు.
సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ బృందానికి విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే సైఫాబాద్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆదర్శనగర్ లో ఉన్న ప్రిన్ స్టాన్ అపార్ట్మెంట్స్ పై దాడి చేసి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 670 ఈ-ఎలక్ట్రానిక్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లో దీని విలువ 21,00,000 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా.