దేశ రాజధానిలో మరో దారుణం..!

IIT Delhi PhD student killed, friend injured in hit-and-run, probe on. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సమీపంలో కారు ఢీకొనడంతో

By Medi Samrat
Published on : 18 Jan 2023 6:46 PM IST

దేశ రాజధానిలో మరో దారుణం..!

దక్షిణ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సమీపంలో కారు ఢీకొనడంతో 30 ఏళ్ల రీసెర్చ్ స్టూడెంట్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అష్రఫ్ నవాజ్ ఖాన్, అంకుర్ శుఖ్లా IITలో PhD చదువుతున్నారు. పక్కనే ఉన్న ఎస్‌డీఏ మార్కెట్‌లో రాత్రి భోజనం ముగించుకుని ఐఐటీ క్యాంపస్‌కు తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. స్థానికులు ఇద్దరినీ సాకేత్‌లోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అష్రాఫ్ మరణించినట్లు ప్రకటించారు. అంకుర్‌కు ఫ్రాక్చర్‌ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో కారు విడిచిపెట్టారని, డ్రైవర్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు.

గత కొద్దిరోజులుగా దేశ రాజధానిలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు జనాగ్రహానికి కారణం అవుతూ ఉన్నాయి. తాజాగా విద్యార్థి ఇలా గాయపడడంతో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలకు తావిస్తూ ఉంది.


Next Story