ఏడో అంతస్తు నుంచి దూకి.. ఐఐటీ స్టూడెంట్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే
IIT Bombay student kills self by jumping from 7th floor. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ విద్యార్థి
By అంజి Published on
17 Jan 2022 6:43 AM GMT

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ విద్యార్థి సోమవారం క్యాంపస్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు (26) మాస్టర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో క్యాంపస్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకినట్లు తెలిపారు. తోటి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో.. విద్యార్థులు షాక్కు గురయ్యారు.
అతడిని ఘట్కోపర్లోని రాజావాడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి హాస్టల్ నుంచి సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను డిప్రెషన్తో బాధపడుతున్నానని, చికిత్స పొందుతున్నానని విద్యార్థి నోట్లో పేర్కొన్నాడు. తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయలేదని పోలీసులు నోట్ను ప్రస్తావిస్తూ చెప్పారు. ఈ ఘటనపై పొవాయ్ పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Next Story