క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక కఠిన నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

By Medi Samrat  Published on  17 Feb 2024 12:30 PM GMT
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక కఠిన నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్.. అతని భార్య భాగ్య పురుగుల మందు తాగి చనిపోయారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తమ ఇద్దరు పిల్లలు సౌషిక్ (17), భవన్ (15)లను కుటుంబసభ్యుల ఇంటికి పంపించి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సురేష్ కుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. క్రెడిట్ కార్డు మీద డబ్బులు తీసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా బిల్లులు చెల్లించలేకపోయారు. దీంతో దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సురేష్ కుమార్ అతని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని గంటల తర్వాత పిల్లలు, కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు కొట్టినా కూడా తల్లిదండ్రులు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా దంపతులిద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపల వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

సమాచారం అందుకున్న కీసర పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story