'కాళ్లు పట్టుకున్నా వినలేదు'.. కోల్కతా లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో వెలుగులోకి భయానక విషయాలు
మే 25వ తేదీ బుధవారం రాత్రి కోల్కతాలోని లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.
By Medi Samrat
మే 25వ తేదీ బుధవారం రాత్రి కోల్కతాలోని లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో బాధితురాలు పోలీసుల వద్ద తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ముగ్గురు యువకులు తనను కాలేజీ గార్డ్రూమ్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
అత్యాచార సమయంలో నిందితుల్లో ఒకరు తనపై అత్యాచారం చేశాడని, మరో ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితుడికి సహాయం చేశారన్నారు. ఈ సంఘటన కళాశాల క్యాంపస్లో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జరిగిందని పేర్కొంది.
కాలేజీలో సమావేశం అనంతరం విద్యార్థిని బయటకు వస్తుండగా.. జే, ఎం, పీ అనే పేర్లతో ఉన్న ముగ్గురు యువకులు తనను చుట్టుముట్టారని.. M మరియు P తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లారని.. అక్కడ J తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది.
బాధితురాలు పోలీసులతో మాట్లాడుతూ.. “నేను చాలా ఏడ్చాను.. నన్ను వెళ్లనివ్వమని అడిగాను.. నేను అతని పాదాలను పట్టుకుని ప్రాథేయపడ్డాను.. కానీ అతడు కనికరించలేదు. నాతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను అతడిని దూరంగా నెట్టివేసి అత్యాచార ప్రయత్నాన్ని నిరాకరించాను. నేను ఒప్పుకోలేను.. నాకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడు.. నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పినట్లు పేర్కొంది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యానని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
J అత్యాచార సమయంలో M మరియు P లను లోపలికి పిలిచి సాయమడిగాడని.. అయితే ఇద్దరూ ఆ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారని ఆమె ఆరోపించారు. తర్వాత M తనకు ఇన్హేలర్ను ఇచ్చాడని.. అది కొంత సాధారణ స్థితికి రావడానికి హెల్ప్ అయ్యిందని.. అయితే.. నేను పారిపోయేందుకు ప్రయత్నించగా.. ముగ్గురూ తనను పట్టుకున్నారని.. కాలేజీ మెయిన్ గేట్ మూసేసి గార్డును బెదిరించి బయటకు తోసేశారని బాధితురాలు చెబుతోంది. ఆ తనను గార్డ్రూమ్కి తీసుకెళ్లి.. అక్కడ J అనే వ్యక్తి అత్యాచారం చేశాడని వెల్లడించింది.