ఇరాన్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ పౌరులు అదృశ్యమయ్యారని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. తప్పిపోయిన భారతీయ పౌరులను గుర్తించి వారి భద్రతను నిర్ధారించాలని భారత ప్రభుత్వం ఇరాన్లోని అధికారులను కోరింది. "ఇరాన్కు ప్రయాణించిన తర్వాత ముగ్గురు భారత్ కు చెందిన వ్యక్తులు కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యుల భారత రాయబార కార్యాలయానికి తెలియజేశారు. ఈ విషయాన్ని రాయబార కార్యాలయం ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తప్పిపోయిన భారతీయులను తక్షణమే గుర్తించాలని, వారి భద్రతను నిర్ధారించాలని అభ్యర్థించింది" అని భారత రాయబార కార్యాలయం Xలో ఒక పోస్ట్లో తెలిపింది.
టెహ్రాన్లోని భారత కమీషన్ తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాలకు వారి జాడ కోసం జరుగుతున్న ప్రయత్నాల గురించి క్రమం తప్పకుండా తెలియజేస్తుంది. పంజాబ్కు చెందిన యువకులలో ఒకరి తల్లి, మే 1 నుండి వారిని అక్కడ అపహరించారని, వారిని విడుదల చేయడానికి కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ముగ్గురు వ్యక్తులు పంజాబ్లోని సంగ్రూర్, నవాన్షహర్, హోషియార్పూర్ జిల్లాల నివాసితులు. వారు ఢిల్లీ నుండి విమానంలో ప్రయాణించి వర్క్ పర్మిట్పై ఆస్ట్రేలియా చేరుకోవాల్సి ఉంది. ఏజెంట్లు వారిని తాత్కాలికంగా అక్కడ ఉండే నెపంతో ఇరాన్కు తీసుకెళ్లారు. ఆ తరువాత వారిని కిడ్నాప్ చేశారు.