దారుణ ఘటన... బాలికపై తండ్రితో సహా 28 మంది..!

Girl was raped by 28 people. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల యువతిపై 28 మంది అత్యాచారానికి

By అంజి  Published on  13 Oct 2021 12:31 PM GMT
దారుణ ఘటన... బాలికపై తండ్రితో సహా 28 మంది..!

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల యువతిపై 28 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో యువతి తండ్రి కూడా గమనార్హం. ఈ దారుణ ఘటన యూపీలోని లలిత్‌పూర్‌లో జరిగింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ వాదీ పార్టీలకు చెందిన నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారని యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి తండ్రి, సమాజ్‌ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్‌ జైన్‌ జోజియా, బహుజన సమాజ్‌ వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌ అహిర్వార్‌ సహా 28 మందిపై సెక్షన్ 376 డి, అత్యాచారం, 354, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఆరేళ్ల వయసులోనే బాధితురాలిని ఆమె తండ్రి ఆశ్లీల వీడియోలను చూపించి లైంగికంగా హింసించడం మొదలు పెట్టాడు. బాధితురాలికి కొత్త బట్టలు కొనిచ్చి.. బైక్‌ నేర్పిస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని పొలం గట్టుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని లేదంటే ప్రాణాలతో ఉన్న తన తల్లిని చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు చాలా రోజుల నుండి జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది.

దారుణ ఘటన... బాలికపై తండ్రితో సహా 28 మంది..!తాజాగా ప్రధాన నిందితుడు అయిన బాధితురాలి తండ్రి.. మైనర్‌ కుమార్తెను స్కూల్‌ నుండి తీసుకువచ్చే దారిలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అంతకుముందే మైనర్‌ బాలికకు నిందితుడు మత్తమందులతో కూడిన చిరుతిండ్లను తినిపించాడు. ఆ తర్వాత తనను ఒక మహిళకు అప్పగించారని మైనర్ బాలిక తెలిపింది. మత్తులో ఉన్న ఒక వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. అయితే ఇదంతా హోటల్‌లోని పలు గదుల్లో జరిగిందని, ప్రతిసారీ ఒక కొత్త వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలు తన ఫిర్యాదులో.. ఎస్పీ జిల్లా అధ్యక్షుడు తిలక్‌ యాదవ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాని ఆరోపించింది.

Next Story