ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 15 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు
Fire breaks out at chemical factory in Gujarat's Bharuch. గుజరాత్లోని భారూచ్ జిల్లాలో భారీ పేలుడు చోటు చేసుకుంది.
By Medi Samrat Published on
23 Feb 2021 4:32 AM GMT

గుజరాత్లోని భారూచ్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. జగదీయలోని యుపీఎల్ సంస్థ ప్లాంట్-5లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ప్లాంట్లో జరిగిన ఈ పేలుడు ధాటికి దాదాపు 15 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చాయి. చుట్టు పక్కల గ్రామాలైన దాధేరా, ఫుల్వాడి, కార్ల్సాడి ఇళ్ల కిటికీలపై ఉన్న అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మంటల కారణంగా, భారీగా పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సివుంది. ఆరోగ్య, జిల్లా పరిపాలన ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలోని పటేల్ గ్రూప్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. అప్పటి ఆ ఘటనలో 10 మంది వరకూ మృతి చెందారు.
Next Story