విషాదం.. తండ్రి మరణ వార్తను తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన‌ 17 ఏళ్ల కూతురు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది.

By -  Medi Samrat
Published on : 23 March 2026 11:39 AM IST

విషాదం.. తండ్రి మరణ వార్తను తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన‌ 17 ఏళ్ల కూతురు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లోని దిబాయి ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది. తండ్రి మరణించిన కొద్దిసేపటికే కుమార్తె కూడా మరణించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

మథూరియా ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న 55 ఏళ్ల ఉద్యోగి లక్ష్మీనారాయణ్ రావల్, ఆదివారం రాత్రి సుమారు 9:30 గంటలకు నైట్ డ్యూటీ కోసం తన బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా, నరోరా టోల్ ప్లాజా సమీపంలో అకస్మాత్తుగా ఒక ఎద్దును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఈ ఘోర ప్రమాద వార్త ఇంటికి చేరగానే 17 ఏళ్ల చిన్న కూతురు మమత.. తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో మరణించింది. తండ్రీకూతుళ్లిద్దరూ ఒకే రాత్రి మరణించడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది, ఆ కుటుంబం దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది.

Next Story