కోడలికి చెరుకు రసం తాగించి దారుణానికి ఒడిగ‌ట్టిన మామ

25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసి, ఆమె మామ గొంతు బిగించి చంపాడని పోలీసులు తెలిపారు.

By Medi Samrat
Published on : 26 Jun 2025 5:46 PM IST

కోడలికి చెరుకు రసం తాగించి దారుణానికి ఒడిగ‌ట్టిన మామ

25 ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేసి, ఆమె మామ గొంతు బిగించి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణం ఒడిగట్టిన తర్వాత ఆమెను ఇంటి బయట 10 అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టాడని పోలీసులు వెల్లడించారు. ఫరీదాబాద్ పోలీసులు 54 ఏళ్ల వ్యక్తిని తన కోడలిని హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నిందితులు వారి ఇంటి బయట రోడ్డు పక్కన గొయ్యి తవ్విన తర్వాత బాధితురాలిని గొంతు నులిమి చంపి పాతిపెట్టినట్లు సమాచారం.

ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. "ఈ కేసులో అత్యాచారం సెక్షన్లను చేర్చాము. బాధితురాలి మామ కూడా నేరాన్ని అంగీకరించాడు. అతను మొదట బాధితురాలికి చెరకు రసం తాగించి మత్తులోకి దించాడు. దీని ఫలితంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి, ఏప్రిల్ 21న సాయంత్రం దుపట్టాతో గొంతు నులిమి చంపాడు." అని తెలిపారు. ఇంట్లో కొనసాగుతున్న వివాదాలు దంపతులు విడాకులు తీసుకోవాలనే నిర్ణయం తీసుకునేలా చేశాయని పోలీసులు వివరించారు.

Next Story