పుట్టినరోజు జరుపుకోడానికి సొంత ఊరికి వచ్చి.. నక్సల్స్ చేతిలో హ‌త‌మ‌య్యాడు

Family enjoying birthday party, suddenly arrives Naxalites and dead bodies scattered. జార్ఖండ్‌లో నక్సలైట్లు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు.

By Medi Samrat  Published on  24 Dec 2021 8:57 AM GMT
పుట్టినరోజు జరుపుకోడానికి సొంత ఊరికి వచ్చి.. నక్సల్స్ చేతిలో హ‌త‌మ‌య్యాడు

జార్ఖండ్‌లో నక్సలైట్లు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. పశ్చిమ సింగ్‌భూమ్‌లోని గోయెల్కేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గిటిల్పిలో 20-25 మంది సాయుధ నక్సలైట్లు మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తిని అతని ఇంటి నుండి కిడ్నాప్ చేసి మళ్లీ కాల్చి చంపారు. అతని మృతదేహం రాత్రిపూట గోయెల్కేరా-చైబాసా ప్రధాన రహదారిపై పడి ఉంది. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చక్రధరపూర్‌కు తరలించారు.

ప్రేమ్ సూరిన్ అనే వ్యక్తి తన పుట్టినరోజును కుటుంబంతో జరుపుకోవడానికి మంగళవారం గ్రామానికి వచ్చాడు. తన పుట్టినరోజును 40-50 మంది మధ్య ఇంట్లో వేడుకలు జరుపుకుంటూ ఉండగా.. రాత్రి 10 గంటల సమయంలో 20-25 మంది నక్సలైట్లు వచ్చారు. కొందరు నక్సలైట్లు ఇంట్లోకి ప్రవేశించి ఆయుధాలతో మహిళలను బెదిరించి.. వారిని ఓ గదిలో బంధించి బయటి నుంచి తాళం వేశారు.

ప్రేమ్ సూరిన్ సహా మరో ఐదుగురిని నక్సలైట్లు ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు. ప్రేమ్ సూరిన్ మినహా అందరినీ నక్సలైట్లు తాడుతో కట్టేశారు. ఆ తర్వాత, నక్సలైట్లు ప్రేమ్ సూరిన్‌ను గోయెల్‌కేరా-చైబాసా ప్రధాన రహదారిపై ఇంటి నుండి 200 మీటర్ల దూరం తీసుకెళ్లి కాల్చి చంపారు. గోయెల్‌కేరా నుంచి కుయిడా మీదుగా చైబాసాకు వెళ్లే బస్సులో ప్రేమ్ సూరిన్ క్లీనర్‌గా పనిచేశాడు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. పోలీసులు, భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్ కారణంగా నక్సలైట్ల ప్రాబల్యం కాస్త తగ్గించింది. నక్సలైట్లకు గ్రామస్థుల మద్దతు కూడా లభించడం లేదు. ప్రేమ్ సూరిన్ పోలీసులకు సహకారం ఇస్తున్నాడనే చంపేసి ఉంటారని భావిస్తున్నారు.


Next Story