యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

Eight killed after SUV rams into truck in Siddharthnagar.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 7:01 AM GMT
యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 8 మంది మ‌ర‌ణించ‌గా.. ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. సిద్ధార్థ్‌న‌గ‌ర్ జిల్లాలోని జోగియా కొత్వాలి ప్రాంతంలోని నౌగర్ బన్నీ రోడ్డులో ఉన్న కాత్యా గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్ర‌క్కును బొలేరో వాహ‌నం ఢీ కొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో బొలెరో వాహ‌నంలో 11 మంది ఉండ‌గా.. వీరిలో 8 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌తగాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రికి మెరుగైన వైద్యం కోసం బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా,, గాయపడిన వారిలో ఒకరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రై తిరిగి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మితిమీరిన వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్ష‌త‌గాత్రులంద‌రికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన రూ.50వేలు చొప్పున అందించ‌నున్నారు.

Next Story